ఇంగ్లాండ్ విజయం: ధర్మశాల వన్డే
- Details
- Published on Sunday, 27 January 2013 18:21
భారత్పై 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న 5వ ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్లో తొలుత ఇండియా 49.4 ఓవర్లకు 226 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 47.2 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 227 పరుగులు చేసి గెలుపొందింది. బెల్ 113 పరుగులు, మోర్గాన్ (నాటౌట్) 40, రూట్ 31, కూక్ 22, పీటర్స్న్ 6 పరుగులు చేశారు.
అహ్మద్, శర్మ, జడేజా ఒక్కో వికెట్ తీసుకున్నారు. 3-2 తేడాతో సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది.











