తెలంగాణ జెఎసి నేతల సమరదీక్ష ప్రారంభం
- Details
- Category: రాష్ట్రీయం
-
27 Jan 2013
- Published on Sunday, 27 January 2013 16:09
ఇందిరా పార్కు వద్ద తెలంగాణ రాజకీయ జెఎసి నేతలు సమరదీక్ష ప్రారంభించారు. సమరదీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం తెలంగాణ ప్రజల విజయంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అభివర్ణించారు. సీమాంధ్రలో సమావేశాలకు అనుమతిచ్చిన ప్రభుత్వం తమకు ఇవ్వడానికి ఎందుకింత ఇబ్బంది పెట్టిందో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిజిపి వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తక్షణమే రాజీనామాలు చేసి ప్రజలతో కలిసి పనిచేయాలన్నారు. తెలంగాణవాదులంతా ఇందిరాపార్కు సమరదీక్షకు తరలిరావాలని ఆయన పిలుపు ఇచ్చారు. రేపు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సమరదీక్ష కొనసాగుతుందని ఆయన తెలిపారు.
ఇదిలా ఉండగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా దీక్ష నిర్వహించుకోవాలని సీపీ సీపీ అనురాగ్ శర్మ కోరారు. రేపు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇందిరాపార్క్ వద్ద దీక్షకు అనుమతి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. సమరదీక్షలో పాల్గొనేందుకు 2 వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు చెప్పారు.











