జగన్ బెయిల్పై తీర్పు 24కు వాయిదా
- Details
- Category: రాష్ట్రీయం
-
22 Jan 2013
- Published on Tuesday, 22 January 2013 15:21
ఒక్క సీసీ8 లోనే కాకుండా, అన్ని అంశాలకు సంబంధించి జగన్ను రిమాండ్లోకి తీసుకున్నారని నిరంజన్ కోర్టుకు తెలిపారు. కేవలం దాఖలుచేసిన ఛార్జిషీటుకు సంబంధించి మాత్రమే రిమాండ్లోకి తీసుకోలేదన్నారు. వీలైనంత త్వరలో దర్యాప్తు పూర్తిచేస్తామని సీబీఐ సుప్రీం కోర్టుకు చెప్పిందని, అయితే దర్యాప్తు ముగింపునకు అంతం ఎక్కడ? అని ఆయన ప్రశ్నించారు. ఎంతకాలం అంటే అంతకాలం జగన్ను జైలులో ఉంచుతారా? అని అడిగారు. 90 రోజులకు మించి ఎట్టి పరిస్థితుల్లోనూ కస్టడీలో ఉంచకూడదని ఆయన వాదించారు.
దర్యాప్తు పూర్తిచేయడానికి సమయం పడుతుందని సిబిఐ హైకోర్టుకు తెలిపింది. ఎంతకాలం పడుతుంది? ఎన్నేళ్లు పడుతుంది? అని సీబీఐపై హైకోర్టు మండిపడింది. దర్యాప్తు పూర్తిచేయడం కష్టంగా ఉందని సీబీఐ తెలిపింది. దర్యాప్తునకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం అందడంలేదని చెప్పింది. ఈ విషయాన్ని చెప్పడానికి తాము సంకోచించడంలేదని సిబిఐ హైకోర్టుకు తెలిపింది.











