సమైక్యవాదాన్నే వినిపించా: గాదె
- Details
- Category: రాష్ట్రీయం
-
28 Dec 2012
- Published on Friday, 28 December 2012 15:33
అఖిలపక్ష సమావేశంలో తాను సమైక్యవాదాన్నే వినిపించానని కాంగ్రెస్ తరపున భేటీలో పాల్గొన్న గాదె వెంకటరెడ్డి తెలిపారు. తానెప్పటికీ సమైక్యవాదినే అని, అయితే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
అఖిలపక్ష సమావేశం సంతృప్తిగా జరిగిందని సురేష్ రెడ్డి తెలిపారు. నెల రోజుల్లోగా తెలంగాణపై అనుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లోపల ఒకటి జరిగితే కేసీఆర్ బయటొకటి మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై తాను స్పందించనని సురేష్ రెడ్డి తెలిపారు.











