తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన కేసీఆర్
- Details
- Category: రాష్ట్రీయం
-
28 Dec 2012
- Published on Friday, 28 December 2012 12:47
కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ శనివారం తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అఖిలపక్ష భేటీతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని...ఇది పనికిమాలిన మీటింగ్ అంటూ అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం మళ్లీ పాతపాటే పాడిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ బంద్ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
నెలరోజుల్లో తెలంగాణపై నిర్ణయం అన్న షిండే మాటలు కంటితుడుపు చర్యలేనని కేసీఆర్ మండిపడ్డారు. గతంలో ఇటువంటి హామీలు వెయ్యిసార్లు ఇచ్చిందని ఆయన పెదవి విరిచారు. తెలుగుదేశం పార్టీ 2008లో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని చెప్పలేదని.... అధికారం కేంద్రం చేతుల్లోనే ఉందని కాబట్టి వారే నిర్ణయం తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందని కేసీఆర్ తెలిపారు.











