జగన్ బెయిల్ పిటిషన్ జనవరి4కు వాయిదా
- Details
- Category: రాష్ట్రీయం
-
26 Dec 2012
- Published on Wednesday, 26 December 2012 15:04
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది.సీబీఐ మూడు నెలలలో దర్యాప్తు పూర్తి చేస్తామని సుప్రీంకోర్టుకు చెప్పిందని, ఆ గడువు ఇంకా పూర్తి కాలేదని న్యాయస్థానం తెలిపింది. మూడు నెలల గడువు ముగిశాక బెయిల్ కోసం వస్తే బాగుంటుందని కోర్టు అభిప్రాయపడింది.
మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని సుప్రీంకోర్టు చెప్పిందని సీబీఐ చెప్పిందని... అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ దర్యాప్తు విషయంలో పరిస్థితులు ఏమీ మారలేదని హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. దర్యాప్తు ఎంతవరకూ పూర్తి చేశారో నివేదిక సమర్పించాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. జనవరి 4వ తేదీన మళ్లీ వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.












