తుదిగడువు లేదు: ఆజాద్
- Details
- Published on Sunday, 27 January 2013 18:17
తెలంగాణపై ఒక నిర్ణయం తీసుకోవడానికి తుది గడువు అంటూ ఏదీలేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు గులాంనబీ ఆజాద్ చెప్పారు. ఈ సాయంత్రం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర హొం శాఖ వివరిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, ఇతర సీనియర్ నేతలను ఢిల్లీకి పిలిపిస్తున్నామని వారితో సంప్రదింపులు జరుపవలసి ఉందన్నారు. సంప్రదింపుల ప్రక్రియ పూర్తి కాలేదని, మరింత సమయం పడుతుందని చెప్పారు. మూడు ప్రాంతాల సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు చర్చించవలసి ఉందన్నారు.
తాను చెబుతున్నది పార్టీ అభిప్రాయం మాత్రమేనని, ప్రభుత్వం తరపున అభిప్రాయం కేంద్ర హొం శాఖ చెబుతుందన్నారు.














